“రావే నా చెలియా ట్రైలర్” ను విడుదల చేసిన చంద్రకాంత్

“రావే నా చెలియా ట్రైలర్” ను విడుదల చేసిన చంద్రకాంత్

Published on Aug 5, 2021 10:00 AM IST


సూర్య చంద్ర ప్రొడక్షన్ బ్యానర్‌లో నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రావే నా చెలియా. కీర్తి శేషులు నెమలి సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏడు నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇటీవల థియేటర్స్ మళ్లీ తెరుచుకోవడంతో ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు చంద్రకాంత్ ట్రైలర్ విడుదల చేయగా, సినిమాలోని మొదటి పాటను నటుడు కృష్ణతేజ్ విడుదల చేశారు. మరో పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ పాల్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ, ఈ సినిమాలో ఉన్న పాటలు చాలా బాగున్నాయి, అలాగే లిరిక్స్, డిఓపి వర్క్ ఇంకా బాగున్నాయి అని అన్నారు. ఇక డైలాగ్స్ అయితే ఇరగదీశారు, ఈ చిత్ర నిర్మాత నెమలి సురేష్ ఇటీవలే చనిపోయారని తెలిసింది, ఒక మంచి ప్రొడక్ట్ ఇచ్చి చూడకుండానే ఆయన లేకపోవడం చాలా బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు. మంచి సబ్జెక్ట్‌తో ముందుకొచ్చిన డైరెక్ట్ మహేశ్వర్ రెడ్డికి మరెన్నో మంచి అవకాశాలు రావాలని, సినిమాకు మంచి డబ్బు చేకూరాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 6న సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్‌లో ట్రైలర్ విడుదల చేయనున్నాము అని తెలిపారు. అలానే ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి టీమ్ అందించిన సపోర్ట్ మరిచిపోలేనని, తెలుగు ప్రేక్షకులు చిత్రాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము అని అన్నారు.

కొరియోగ్రాఫర్ పాల్ మాట్లాడుతూ, రావే నా చెలియా చిత్రంతో నా రీ ఎంట్రీ కుదిరింది, హీరో హీరోయిన్స్ చాలా బాగా సపోర్ట్ చేసి డాన్స్ బాగా చేశారు. ఈ చిత్ర నిర్మాత నెమలి సురేష్‌గారు చాలా సపోర్టివ్‌గా ఉండేవారు, మా అబ్బాయి హీరోగా సంవత్సరానికి మూడు సినిమాలు చేయాలని నా కోరిక అనే వారని, ఇప్పుడు చిత్రం విడుదలవుతున్న సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం నన్ను చాలా బాధిస్తోంది అని అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా సినిమా విడుదల వరకు తీసుకొచ్చిన హీరో నెమలి అనిల్‌ను, డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డిని లను అభినందించారు. సినిమా చాలా బాగా వచ్చిందని తెలిసింది. అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

అయితే ఈ కార్యక్రమంలో హీరోయిన్ సుబాంగి పంత్, నటుడు అంకిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కుమార్, డైలాగ్ రైటర్ మల్లేశ్వర్ బొగ్గ, ఫైట్ మాస్టర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు