‘రవితేజ’తో మళ్ళీ రాశి కన్నా.. ?

‘రవితేజ’తో మళ్ళీ రాశి కన్నా.. ?

Published on Aug 8, 2020 4:47 PM IST

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. కాగా ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అట. దాంతో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా రాశి కన్నాను తీసుకోనున్నారని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. తమిళంలో అరవింద స్వామి, త్రిష కలయికలో రానున్న ‘శతురంగ వెట్టై 2’ చిత్రాన్నే తెలుగులో రవితేజ చేయబోతున్నాడట. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అన్నట్టు ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఇప్పటికే సగం పైగా షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రాన్ని కరోనా అనంతరం తేదీన విడుదల చేయాలనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు