విడుదలకు సిద్ధమైన జర్నీ

విడుదలకు సిద్ధమైన జర్నీ

Published on Nov 24, 2011 12:46 AM IST

శర్వానంద్, అంజలి, జై మరియు అనన్య నటించిన ‘జర్నీ’ చిత్రం డిసెంబరు 2 న విడుదలకి సిద్ధమైంది. ఈ చిత్రం తమిళంలో ‘ఎంగేయుం ఎప్పోధం’ అనే పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులో జర్నీ పేరుతో విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఆడియోని హైదరాబాద్ లో విడుదల చేయగా మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరుకు సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. సత్య సంగీతం అందించిన ఈ చిత్రానికి వేల్ రాజ్ సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు