కమెడియన్ గా ఉండగానే హీరోగా పరయత్నాలు మొదలుపెట్టి ‘గీతాంజలి, జయంబు నిశ్చయంబురా’ వంటి సినిమాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన నటుడు శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘జంబ లకిడి పంబ’. 1993లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబ లకిడి పంబ’ సినిమా పేరుతోనే ఈ చిత్రం వస్తుండటంతో ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని జూన్ 22వ తేదీన విడుదలచేయనున్నారు. జె.బి.మురళి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రవి, జోస్, శ్రీనివాస్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. సిద్ది ఇద్నాని కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళిలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ప్రధానాంశంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.