‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకున్న నటి రుక్మిణి వసంత్, ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ బ్యూటీ చేసిన ‘అప్పుడు ఇప్పుడు ఎప్పుడు’తో పాటు ‘భైరతి రణగల్’, ‘బగీరా’, ‘ఏస్’, ‘మదరాసి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆమె కథల ఎంపికపై చర్చ మొదలైంది.
తాజాగా యష్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ చిత్రం డిజాస్టర్ టాక్ మూటగట్టుకోవడంతో రుక్మిణిపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇందులో ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు, నటన సరిగా లేకపోవడంతో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వరుస ప్లాపుల నేపథ్యంలో ఆమె తన నెక్స్ట్ చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న బిగ్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ ఆమె కెరీర్కు ఎంతవరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.


