ఆగస్ట్ 1న శర్వానంద్ ‘రన్ రాజా రన్’

ఆగస్ట్ 1న శర్వానంద్ ‘రన్ రాజా రన్’

Published on Jul 18, 2014 3:00 PM IST

Run Raja Run
యువ హీరో శర్వానంద్ నటించిన ‘రన్ రాజా రన్’ చిత్రం ఆగస్ట్ 1న విడుదలవుతుంది. గురువారం సెన్సార్ కార్యక్రమాలను ముగించుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల నుండి అద్బుతమైన స్పందనను సొంతం చేసుకుంది.

శర్వానంద్ సరసన సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించింది. సుజీత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశ్వరూపం-2 ఫేం గిబ్రన్ అందించిన సంగీతం హిట్ కావడం, ట్రైలర్ కొత్తగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మిర్చి సినిమా నిర్మాతలు ప్రమోద్, వంశి ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు