మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుంది ?

మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుంది ?

Published on Sep 30, 2018 9:57 AM IST

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదలవ్వడానికి శరవేగంగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది.

కాగా తాజా సమాచారం ప్రకారం, రామ్ తన తర్వాత సినిమా మల్టీస్టారర్ గా రాబోతుంది. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రామ్ నటించనున్న విషయం తెలిసిందే. అయితే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంలో రామ్ తో కలిసి నటించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. రామ్ పెద్దనాన్న స్రవంతి రవి కిషోరే ఈ చిత్రాన్ని నిర్మించ బోతున్నారు. త్వరలో అధికారిక ప్రకటించనున్నారని సమాచారం.

ఇక ‘హలో గురు ప్రేమ కోసమే’ లో కామెడీ హైలెట్ అవ్వనుందట. ఈ చిత్రంతో రామ్ మళ్ళీ హిట్ కొట్టడం ఖాయం అని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు