మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని వైద్యులు, కుటుంబ సభ్యులు చెబుతున్నా, ఆయన కనిపించకపోవడంతో అభిమానులు ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతూనే ఉన్నారు. అయితే తాజాగా సాయి తేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు మరోసారి అప్డేట్ ఇచ్చారు.
దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న తేజ్ ఇటీవల డిశ్చార్జ్ అయ్యాడని, ఇంటిదగ్గరే ఉన్న తేజ్ పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకున్నాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ చికిత్సలో తేజ్ ఉన్నట్టు తెలిపారు. ముఖంపై తగిలిన గాయాలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయని, అంతే కాకుండా త్వరలోనే కొత్త సినిమా షూటింగ్లో తేజ్ పాల్గొంటాడని చెప్పుకొచ్చారు.