డిసెంబర్ 15 న రిలీజ్ కానున్న “సఖి”

డిసెంబర్ 15 న రిలీజ్ కానున్న “సఖి”

Published on Dec 11, 2023 8:17 AM IST

జానీ బాషా దర్శకుడిగా, వన్ మీడియా ఇటి ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై పార్థు రెడ్డి నిర్మిస్తున్న చిత్రం సఖి. ఈ చిత్రంలో లోకేష్ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్లా, సందీప కురలేటి, సుధాకర్ రెడ్డి, జ్యోతి స్వరూప్, జితిన్ ఆదిత్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 15న థియేటర్ల లో విడుదల కానుంది.

ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంటపై, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌తో పాటు సినిమా కూడా అదే వైబ్‌ని కలిగి ఉంటుందని, సినిమా బాగా వస్తుందని, ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఉందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సన్నీ సంకురు సంగీతం అందిస్తుండగా, సతీష్ కుమార్ కరే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు