సమంత హెల్త్ పై లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చిన టీమ్

సమంత హెల్త్ పై లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చిన టీమ్

Published on Dec 1, 2022 2:02 AM IST

టాలీవుడ్ స్టార్ కథానాయిక సమంత రూత్ ప్రభు ఇటీవల పాన్ ఇండియన్ మూవీ యశోద ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. అందులో యశోదగా సమంత పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి ప్రసంశలు దక్కాయి. అలానే గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన శాకుంతలం మూవీ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల కొన్నాళ్లుగా తాను మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని, డాక్టర్లు ప్రస్తుతం తనకు మెరుగైన చికిత్స అందిస్తున్నప్పటికీ పూర్తిగా దాని నుండి బయటపడడానికి మరికొంత సమయం పడుతుందని తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇటీవల పోస్టు ద్వారా తెలిపారు సమంత.

తన చుట్టూ ఉన్న కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులతో పాటు అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకి ఎప్పటికీ తాను రుణపడి ఉంటానని, తప్పకుండా ఆత్మవిశ్వాసంతో మాయోసైటిస్ ని ఎదుర్కొని బయటపెడతానని ఆమె తెలిపారు. అయితే సమంత ఆరోగ్యం మరింత క్షీణించింది అంటూ రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో మరికొందరు కథనాలు ప్రచారం చేస్తుండడంతో లేటెస్ట్ గా ఆమె టీమ్ వాటిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కావాలనే కొందరు సమంత గారి హెల్త్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఆమె ప్రస్తుతం తన వ్యాధికి చికిత్స తీసుకుంటూ మెల్లగా కోలుకుంటున్నారని, దయచేసి ఎవరూ అటువంటి పుకార్లు నమ్మవద్దని వారు తెలిపినట్లు తెలుస్తోంది. దీనితో సమంత హెల్త్ పై వస్తున్న పుకార్లకు చెక్ పడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు