మహేష్, తమన్నాల స్పెషల్ సాంగ్.. ఈరోజే

మహేష్, తమన్నాల స్పెషల్ సాంగ్.. ఈరోజే

Published on Dec 9, 2019 10:59 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టాకీ పార్ట్ పూర్తైన సంగతి తెలిసిందే. దీంతో టీమ్ పాటల చిత్రీకరణలో ఉంది. ప్రధానంగా సినిమాలో మహేష్, మిల్కీ బ్యూటీ తమన్నాల మీద ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఈ పాటను ఈరోజే చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.

మహేష్ గత సినిమాలన్నింటిలో ప్రత్యేక గీతాలు బాగా పాపులర్ అయిన నేపథ్యంలో ‘సరిలేరు’లోని స్పెషల్ సాంగ్ మీద మంచి అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇకపోతే సినిమా నుండి ఇప్పటికే విడుదలైమ ‘మైండ్ బ్లాక్’ సాంగ్ బాగా ఆకట్టుకోగా ఈరోజు ఇంకో పాట ‘సూర్యుడివో చంద్రుడివో’ విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. అలాగే సీనియర్ నటి విజయశాంతి ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. జనవరి 11న చిత్రం భారీ ఎత్తున విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు