28ఏళ్ల సినీ ప్రయాణం పై షారుక్ ఎమోషనల్ పోస్ట్.

28ఏళ్ల సినీ ప్రయాణం పై షారుక్ ఎమోషనల్ పోస్ట్.

Published on Jun 28, 2020 11:29 PM IST

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ఓ స్పెషల్ అకేషన్ కి సోషల్ మీడియాలో స్పందించాడు. ఆయన బాలీవుడ్ లో అడుగుపెట్టి 28 ఏళ్ళ అవుతుంది. 1992లో వచ్చిన రాజ్ కన్వర్ రొమాంటిక్ డ్రామా దీవానాతో నటుడిగా ఆరంగేట్రం చేసిన ఆయన కెరీర్‌లో ఎన్నో అద్బుతమైన సినిమాలు చేశారు. దిల్ వాలే, బాజీఘర్‌, డర్‌, కుచ్ కుచ్ హోతా హై, కల్ హో న కహో, మే హూనా, వీర్ జారా, మై నేమ్ ఈజ్ ఖాన్, చక్ దే ఇండియా ఇలా ఎన్నో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో నటించారు. 1995లో షారూఖ్- కాజోల్ ప్రధాన పాత్రలలో రూపొందిన దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక రోజులు నడిచిన చిత్రంగా రికార్డు సాధించింది.

కెరీర్‌లో 28 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా షారూఖ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నా అభిరుచి నా లక్ష్యంగా మారింది. అదే వృత్తిగా మారింది. ఇలా ఎలా జరిగిందో తెలియదు. మిమ్మల్ని అలరించే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా వృత్తి నైపుణ్యం కంటే, నా అభిరుచి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. 28 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఫోటో తీసినందుకు గౌరీఖాన్‌కి కృతజ్ఞతలు అని షారూఖ్ పేర్కొన్నారు. జీరో సినిమా తర్వాత మరో మూవీ చేయని ఎస్ఆర్కే త్వరలో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులని పలకరించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు