యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఈ గురువారం విడుదలై బాక్సాఫిస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను సాధిస్తుంది. ఇక మూడు రోజులకగాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 23కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈరోజు కూడాఈచిత్రం మంచి కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది. ఇక ఈసోమవారం నుండి ఎలాంటి రన్ ను కనబరుస్తుందో అనే దానిఫై ఈచిత్ర విజయావకాశాలు ఆధారపడివుంటాయి.
మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించగా సీనియర్ నటి రమ్య కృష్ణ ముఖ్య పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.