గ్రాఫిక్స్ టీం కు డెడ్ లైన్ విధించిన శంకర్ !

గ్రాఫిక్స్ టీం కు డెడ్ లైన్ విధించిన శంకర్ !

Published on Sep 20, 2018 5:20 PM IST

ప్రముఖ దర్శకుడు శంకర్ ‘2.0’ చిత్ర గ్రాఫిక్స్ టీం కు డెడ్ లైన్ విధించాడు. అక్టోబర్ 15వ తేదీలోపు ఈ చిత్రం యొక్క గ్రాఫిక్స్ కంటెంట్ మొత్తం రెడీ అయిపోవాలని ఎలాంటి డిలే ఉండకూడదని గ్రాఫిక్స్ టీంకు గట్టిగానే చెప్పడాట ఈ దర్శకుడు. ఎందుకంటే శంకర్, రజి నీ అభిమానులకు మాటిచ్చాడట సినిమాను ఎలాగైనా నవంబర్ 29న థియేటర్లకు తీసుకొస్తానని ఆలా చేయాలంటే ఒక నెల ముందే గ్రాఫిక్స్ పార్ట్ అంత సిద్ధంగా వుంచుకుపోవాలి. ఆతరువాత ఎలాగూ రీ రికార్డింగ్ తో పాటు మిగితా పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులకు కలిపి మరో నెల సమయం పడుతుంది.

అందుకనే శంకర్ గ్రాఫిక్స్ టీంకు ఈ గడువు విధించారట. ఇప్పటికే ఈ సినిమా విడుదల చాలా ఆలస్యం అయింది. మళ్ళీ ఆలస్యమైతే ప్రేక్షుకులకు ఈ సినిమా ఫై ఆసక్తి తగ్గిపోతుందని బయపడుతున్నాడట శంకర్. ఇక భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. దాదాపు గా 3000 మంది సాంకేతిక నిపుణలు ఈచిత్రానికి పనిచేస్తున్నారు.

ఇక ఇటీవల విడుదలైన ఈచిత్ర టీజర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. సూపర్ స్టార్ రజినీ కాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు