శర్వానంద్ మైనేని మంచి ప్రతిభ ఉన్న నటులలో ఒకరు. అతను తెలుగు చలచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 9 వసంతాలు పూర్తయింది. అతను నటించిన ‘జర్నీ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. అతను నటించిన మొదటి చిత్రం ‘ఐదవ తారీకు’ 2003 లో విడుదలైంది.
ఆ తరువాత చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా ఏమ్బీబీఎస్’ చిత్రంలో నటించారు. ఆ తరువాత వెంకటేష్ తో కలిసి ‘సంక్రాంతి’ లక్ష్మి’ చిత్రాలలో కూడా నటించారు. దేవకట్టా డైరెక్షన్లో వచ్చిన ‘వెన్నెల’ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నారు శర్వానంద్. ప్రస్తుతం అల్లరి నరేష్ తో ఒక చిత్రం చేస్తున్న శర్వానంద్ మరికొన్ని చిత్రాలు కూడా చేయబోతున్నారు.