అందరూ క్షేమంగానే ఉన్నారు – టీమ్ శర్వానంద్!

అందరూ క్షేమంగానే ఉన్నారు – టీమ్ శర్వానంద్!

Published on May 28, 2023 11:09 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర అదుపు తప్పి ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు అని టీమ్ శర్వానంద్ వెల్లడించడం జరిగింది. అంతేకాక అందరూ క్షేమంగా ఉన్నారు అని, కారుకు మాత్రం చిన్న గీత పడినట్లు తెలిపారు.

ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ అక్కడే వున్నారు. ఇది చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని సంఘటన పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ క్లారిటీ తో శర్వానంద్ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు