శృతి హాసన్ నిర్మాణంలో.. !

శృతి హాసన్ నిర్మాణంలో.. !

Published on Jun 21, 2018 5:48 PM IST


కమల్ హాసన్ కుమార్తెగా సినీలోకానికి పరిచయమైన శృతి హాసన్ మొదటినుంచి గాయనిగా, సంగీతదర్శకురాలిగా, నటిగా ఇలా తనలోని మల్టీటాలెంటెడ్ పర్సన్ ని అప్పుడప్పుడు ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఆమె త్వరలో తనలోని నిర్మాతను కూడా పరిచయం చేయబోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం శృతి హాసన్ ‘ఐసిడ్రో మీడియా’ అనే తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. తన బ్యానర్ లో కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ నిర్మిస్తానని ఆమె గతంలో చెప్పారు.

తాజా సమాచారం ప్రకారం శృతి హాసన్ గతంలో చెప్పినట్టుగానే జయప్రకాష్ రాధాకృష్ణన్ అనే దర్శకునితో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆ చిత్రం పేరు ‘ది మస్కిటో ఫిలాసఫీ’ అని తెలుస్తోంది. కాగా జయప్రకాష్ రాధాకృష్ణన్ ‘లెన్స్’ చిత్రానికి దర్శకుడు. ఈ ‘లెన్స్’ చిత్రం అంతర్జాతీయ, జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. విమర్శకుల సైతం ఈ చిత్రాన్ని ప్రసంశించారు. జయప్రకాష్ రాధాకృష్ణన్ చెప్పిన ‘ది మస్కిటో ఫిలాసఫీ’ కథ తనకు బాగా నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు తాను అంగీకరించానని ‘ఐసిడ్రో’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రకథ ప్రధానంగా నలుగురి స్నేహితుల మధ్య సాగుతుందట. ఐతే పాశ్చాత్య సంస్కృతి మత్తులో మర్చిపోబడుతున్న మన సంప్రదాయానికి మధ్యన మన సమాజం ఎటు పోతుంది ? ఏమైపోతుందనే ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు. కాగా ఈ చిత్రంలోని నటీనటులలో చాలామంది కొంతవారే నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు