మళ్ళీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన సీత టీం !

మళ్ళీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన సీత టీం !

Published on May 1, 2019 3:57 PM IST

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’ గత నెల 25న విడుదలకావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఆ తరువాత ఈ చిత్రం మే 24న విడుదలకానుందని ప్రకటించారు. దాంతో సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్.

ఇటీవల విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకొని సినిమా ఫై అంచనాలను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మన్నార చోప్రా , సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక సాయి శ్రీనివాస్ -కాజల్ జంటగా నటించడం ఇది రెండవ సారి. ఇంతకుముందు వీరిద్దరూ కవచం సినిమాలో కలిసి నటించారు అయితే ఆ చిత్రం విజయం సాధించలేదు. మరి ఈ సారైనా హిట్ కొడతారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు