రాజమౌళి మల్టీస్టారర్ కోసం స్టార్ రైటర్ !

రాజమౌళి మల్టీస్టారర్ కోసం స్టార్ రైటర్ !

Published on Sep 21, 2018 12:05 AM IST

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తరవాత ఆయన చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పని చేస్తున్నారు. ఇప్పటికే ఎగ్రిమెంట్లు కూడా అయిపోయాయని సమాచారం. అయితే ప్రస్తుతం సాయిమాధవ్ ఎన్టీఆర్‌ బ‌యోపిక్‌ కు మరియు ‘సైరా’కు మాటలు అందిస్తున్నారు.

కాగా ఈ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర కథ బ్రిటీష్ కాలం నేపథ్యంలో జరగనుందని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ల నిర్మాణాలు అన్ని బ్రిటీష్‌ నేపధ్యానికి, అప్పటి వాతావరణానికి సంబంధించినవేనట. ఆ సెట్స్ లో వాడే ప్రాపర్టీస్ కూడా అన్ని ఆ కాలం నాటివే నని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్ర షూటింగ్ లో మొదటగా ఎన్టీఆర్ పాల్గొంటాడు. ఎన్టీఆర్ పై కొంత భాగం చిత్రీకరించిన తర్వాత రామ్ చరణ్ షూట్ లో జాయిన్ అవుతాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు