అంచనాలకు మించి “వీరశాస్త అయ్యప్ప కటాక్షం”

అంచనాలకు మించి “వీరశాస్త అయ్యప్ప కటాక్షం”

Published on Dec 12, 2019 10:53 PM IST

సీనియర్ యాక్షన్ హీరో సుమన్ హీరోగా 100 క్రోర్స్ అకాడమీ మరియు వరాంగి మూవీస్ పతాకంపై రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకతంలో ప్రముఖ రచయిత మరియు ఆధ్యాత్మికవేత్త వి.ఎస్.పి.తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’.సుమన్ నటిస్తున్న 100వ చిత్రం ఇది.అయితే ఈ చిత్రానికి వి.ఎస్.పి తెన్నేటి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చి స్వయంగా నిర్మించగా వి.ఎస్.ఎల్ జయకుమార్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో వంటి లెజెండరీ గాయకులు గాత్రం అందించారు.

ఈ చిత్రానికి నిర్మాతగా వి.ఎస్.పి తెన్నేటి మీడియాతో మాట్లాడుతూ “అయ్యప్ప కటాక్షం అనగానే.. అందరూ ఒక తరహా కథను ఊహిస్తారు. కానీ ఈ సినిమా అలా ఉండదు అని.అంచనాలను మించి ఉంటుంది. ఒక భక్తి రస ప్రధానమైన చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీయొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఈ చిత్రం ఉంటుంది అని తెలిపారు.అలాగే ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి.. పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవరకు.. సాక్షాత్తూ అయ్యప్ప స్వామి మా వేలు పెట్టుకుని నడిపించారు. ఎక్కడా ఏ ఆటంకం రాకుండా దగ్గరుండి పర్యవేక్షించారని. ఆయన అనుగ్రహం, ఆశీస్సులతోనే సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు.

మా హీరో సుమన్ అందించిన సహాయసహకారాలు మరువలేనివి అని. అలాగే మా దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ కు ఈ చిత్రం తప్పకుండా మంచి పేరు తీసుకువస్తుంది… తెలిపారు.ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే: వి.ఎస్.పి తెన్నేటి అందించగా సంగీతం వి.ఎస్.ఎల్.జయకుమార్ సమకూర్చారు.వి.ఎస్.పి తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్ లు నిర్మించిన ఈ చిత్రానికి,రుద్రాభట్ల దర్శకత్వం వహించారు.భక్తి పారవస్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ డిసెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు