నవంబర్ 14న రానున్న సందీప్ కిషన్ మూవీ

sandeep-kishan (1)
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘రారా కృష్ణయ్య’ సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద విజయాలు అందుకున్న్ యౌంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అదే ‘జోరు’ మరియు ‘బీరువా'(వర్కింగ్ టైటిల్). ఇప్పటికే జోరు దాదాపు పూర్తి కాగా, బీరువా కూడా చివరి దశలో ఉంది. ఈ రెండిటిలో ‘బీరువా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ గా అనుకుంటున్న ‘బీరువా’ అనేది చివర్లో మారే అవకాశం కూడా ఉంది.
సందీప్ కిషన్ – సురభి జంటగా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాకి ‘నా ఊపిరి’ ఫేం కన్మణి డైరెక్టర్. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ – ఉషా కిరణ్ మూవీస్ వారు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక కేవలం రెండు సాంగ్స్ షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. వాటిని కూడా ఫినిష్ చేసి ఈ సినిమాని నవంబర్ 14న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఈ నెలాఖరులో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో సందీప్ కిషన్ – ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ వచ్చి పెద్ద హిట్ అయ్యింది. అదే తరహాలోనే ఇది కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

Exit mobile version