మహేష్ మల్టీ ఫ్లెక్స్ త్వరలోనే ప్రారంభం కానుంది !

మహేష్ మల్టీ ఫ్లెక్స్ త్వరలోనే ప్రారంభం కానుంది !

Published on Sep 18, 2018 8:30 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ,ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏ ఎమ్ బి సినిమాస్ పేరుతో మల్టీ ఫ్లెక్స్ థియేటర్లను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ అధునాతమైన థియేటర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో అందుబాటులోకి రానుంది.

దాంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మల్టి ఫ్లెక్స్ థియేటర్లను నిర్మించనున్నారని సమాచారం. సాంకేతిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ థియేటర్లలో అత్యంత సౌకర్యవంతగా సినిమా చూసే అవకాశం వుంటుందట.

ఇక మహేష్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు