తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం అంచనాలు అందుకొని భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. ఇలా తెలుగు సహా తమిళ్ లో సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకి పైగా గ్రాస్ ని దాటి సూర్య కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా సత్తా చాటుతుంది. నార్త్ అమెరికాలో లేటెస్ట్ గా ఈ సినిమా రికార్డు మైల్ స్టోన్ 2 మిలియన్ యూఎస్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని దాటేసి అదరగొట్టింది. ఇందులో తెలుగు వెర్షన్ నే అధికంగా ఉండడం విశేషం. ఇక ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. అలాగే నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.
$2 MILLION+ in the USA🔥🔥
From day one to this moment…#VishwanathAndSons has been unstoppable❤️
The numbers keep climbing. The love keeps growing. 🔥#BlockbusterVAS #VishwanathAndSons
USA Release by @ShlokaEnts 🇺🇸@Suriya_offl @_mamithabaiju #VenkyAtluri @gvprakash… pic.twitter.com/sIoqE8Q4vK
— Shloka Entertainments (@ShlokaEnts) August 20, 2026
