బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం ఛావా కోసం అందరికీ తెలిసిందే. ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసుడు శంబాజీ మహరాజ్ వీర గాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా భారీ హిట్ అయ్యి బాలీవుడ్ లో పలు రికార్డులు తిరగరాసింది. అంతే కాకుండా తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి వసూళ్లు అందుకుంది.
అయితే ఇపుడు ఓటీటీ రిలీజ్ కోసం సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా రేపు ఏప్రిల్ 11 నుంచి ప్లాన్ ప్రకారం రావాల్సి ఉంది కాని ప్రస్తుతానికి అయితే ఎలాంటి క్లారిటీ కూడా ఇంకా బయటకు రాకపోవడం సస్పెన్స్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ ఇంకా అనౌన్స్ చేయకపోవడం కనీసం నెట్ ఫ్లిక్స్ లో కూడా అప్డేట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఛావా ఓటీటీ ట్రీట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.