
రోబో కి సీక్వెల్ గా శంకర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 2.0 చిత్రం యొక్క టీజర్ వినాయక చవితి రోజు సెప్టెంబర్ 13న విడుదలకానుంది తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే రోజు రజినీ ఆయన అభిమానులకు డబల్ ధమాకా ఇవ్వనున్నాడని సమాచారం.
ప్రస్తుతం ఆయన కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న165వ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రం యొక్కటైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా సెప్టెంబర్ 13న విడుదలచేయాలని భావిస్తోందట చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. ఒకేవేళ ఇదే కాని నిజమైతే రజినీ అభిమానులకు ఆరోజే పండుగ ఇంకా స్పెషల్ కానుంది.