టాలెంటెడ్ హీరో అండ్ స్క్రిప్ట్ రైటర్ నవీన్ పొలిశెట్టి ఈ లాక్ డౌన్ సమయంలో కూడా కామెడీ వీడియోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నారు. కాగా నవీన్ తన తర్వాత సినిమాల కోసం కొన్ని కథలను ఓకే చేసాడు, వాటిలో ఒకటి రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
ఈ లాక్ డౌన్ సమయంలో కూడా నవీన్ కొత్త స్క్రిప్ట్లను వింటున్నాడు. ఆసక్తికరంగా, ఈ కథనాలన్నీ ఫోన్ కాల్స్ ద్వారా జరుగుతున్నాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నవీన్ పొలిశెట్టి గత ఏడాది విడుదలై ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా హిట్ కొట్టాడు.
ప్రస్తుతం నవీన్ నటిస్తోన్న చిత్రం ‘జాతిరత్నాలు’. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. రీసెంట్ గా నవీన్, నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి. . అయితే సదరు వార్తల్లో నిజం లేదని నవీన్ పొలిశెట్టి క్లారిటీ ఇచ్చేసి రూమర్స్కు చెక్ పెట్టిన సంగతి తెలిసింద