టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ మొదటిసారి డైరెక్ట్ గా చేస్తోన్న తెలుగు సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్’. కాగా ఈ సినిమా పట్ల చాలా ఇనెట్రస్టింగ్ గా ఉన్నానని తెలుగు సినిమాలో నటిస్తోన్నందుకు చాలా అనంద పడుతున్నానని ఐశ్వర్య రాజేష్ వ్యక్తపరుస్తోంది.
ఇక నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాను భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తోన్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
కాగా విలేజ్ బ్యాక్ డ్రాప్లో లేడీ క్రికెటర్ కథాంశంతో వస్తున్న ఈ విభిన్న చిత్రం అన్నివర్గాల ఆడియన్స్ని అలరిస్తుందట. పైగా ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్ చేస్తున్నారు. ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేయడం విశేషం.