మణిరత్నం సినిమాలో టాలెంటెడ్ తెలుగు యాక్టర్ !

మణిరత్నం సినిమాలో టాలెంటెడ్ తెలుగు యాక్టర్ !

Published on Sep 19, 2018 1:02 PM IST

పూరి జగన్నాద్ జ్యోతి లక్ష్మీ సినిమాలో హీరోగా నటించిన సత్యదేవ్ తన నటనతో ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను కూడా బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎందుకో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన చిన్నాచితకా క్యారెక్టర్స్ లో నటించిన, అవి అతని కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. రానా హీరోగా వచ్చిన ఘాజిలో సత్యదేవ్ కు కాస్త గుర్తింపు దక్కే పాత్ర దక్కింది. ప్రస్తుతం సత్యదేవ్ రెండు సినిమాల్లో పని చేస్తున్నాడు.

అయితే తాజగా సత్యదేవ్ కు ఓ బంఫర్ ఆఫర్ తగిలింది. మణిరత్నం తదుపరి ప్రాజెక్ట్ లో.. సత్యదేవ్ ఓ ప్రముఖ పాత్రను పోషించబోతున్నాడు. కాగా ఇటీవలే మణిరత్నం నవాబ్ చిత్రంలో.. శింబు పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పాడు. సత్యదేవ్ తన మాడ్యులేషన్ తో మణిరత్నాన్ని మొత్తానికి బాగానే ఆకట్టుకున్నాడు. దాంతో మణి అతనికి తన తరువాతి చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను ఇస్తానని హామీ ఇచ్చాడట. ఇక నవాబ్ చిత్రం సెప్టెంబరు 27న థియేటర్లలోకి వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు