ప్రస్తుతం భారత్-పాక్ మధ్య భీకర వార్ నడుస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ ప్రభావం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సినిమాలపై కూడా పడింది. వార్ నేపథ్యంలో పలు సినిమాలు తమ రిలీజ్ డేట్లను వాయిదా వేసుకుంటున్నాయి. బాలీవుడ్లో ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు వాయిదా పడ్డాయి.
అయితే, ఈ ప్రభావం ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ పై కూడా పడనుందని తెలుస్తోంది. మే నెలలో రిలీజ్ కావాల్సిన చాలా చిత్రాలు వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే నెలలో రిలీజ్ కావాల్సిన హరిహర వీరమల్లు, కింగ్డమ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక మల్టీస్టారర్ చిత్రంగా రాబోతున్న ‘భైరవం’ మే 30న రిలీజ్ అవుతున్నట్లు డేట్ అనౌన్స్ చేశారు.
మరి మే నెలలో రిలీజ్ కావాల్సిన చిత్రాలు ఇంకా ఎన్ని వాయిదా పడుతాయో చూడాలి అని సినీ సర్కిల్స్ అంటున్నారు. ఈ సినిమాల్లో ఏయే సినిమాలు మే నెలలో రిలీజ్ అవుతాయో.. ఏయే సినిమాలు వాయిదా పడుతాయో ఆసక్తికరంగా మారింది.