మల్టీస్టారర్ నుంచి, ప్రేమ కోసం బలైన వారి కోసం ఓ సాంగ్ !

మల్టీస్టారర్ నుంచి, ప్రేమ కోసం బలైన వారి కోసం ఓ సాంగ్ !

Published on Sep 18, 2018 9:52 AM IST

యువ హీరోలు నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రం. నూతన దర్శకుడు ఇంద్రసేన. ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. కాగా వైవిధ్యంమైన కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా డిఫరెంట్ గా ఉంటుందట. ఈ ప్రయోగాత్మకమైన చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోందని తెలుస్తోంది.

తాజాగా ‘వీర భోగ వసంతరాయలు’ చిత్రం నుండి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ పాటను ప్రత్యేకించి ప్రేమ కోసం బలైన వాళ్లకు అంకితం ఇస్తున్నామని చిత్రబృందం తెలిపింది. అయితే సెప్టెంబర్‌ 21న విడుదల అవ్వబోతున్న ఈ పాటను తాజాగా జరిగిన మిర్యాలగూడ ఉదంతంలో ప్రాణాలను కోల్పోయిన ప్రణయ్‌ కు అంకితం ఇచ్చారు.

కాగా క్రైమ్ డ్రామాగా థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు