రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సంక్రాంతి కానుకగా జనవరి 9న పాన్ ఇండియా భాషల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ – ఫాంటసీ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.
ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తొలి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.183 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే అంచనాలకు తగిన స్థాయిలో బాక్సాఫీస్ ఊపు కొనసాగడం లేదు. దీంతో ప్రేక్షకులను మరింతగా ఆకర్షించేందుకు నిర్మాతలు టికెట్ ధరలను నేటి నుంచి మళ్లీ సాధారణ రేట్లకు తీసుకువచ్చారు. ఈ నిర్ణయం థియేటర్లకు ప్రేక్షకుల రాకపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.
ఈ చిత్రంలో సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రఖని, సప్తగిరి, సత్య, VTV గణేష్ తదితరలు కీలక పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.


