పాన్ ఇండియా కాబట్టి ఆ వార్తలను కొట్టిపారేయలేం..!

పాన్ ఇండియా కాబట్టి ఆ వార్తలను కొట్టిపారేయలేం..!

Published on Apr 10, 2020 2:00 AM IST

పవన్ కళ్యాణ్ 27వ చిత్రంపై ఓ క్రేజీ న్యూస్ ప్రచారం అవుతుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వీలిన్ పెర్నాండెజ్ ని ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సైన్ చేసిన జాక్విలిన్ కాల్ షీట్స్ కూడా కేటాయించినట్లు వార్తలు అందుతున్నాయి. చాల రోజులుగా ఈ వార్త ప్రచారంలో ఉండగా అధికారిక ప్రకటన ఐతే రాలేదు.పాన్ ఇండియా లెవెల్ లో భారీగా ఈ సినిమా తెరక్కుతున్న నేపథ్యంలో ఈ ప్రచారాన్ని కొట్టిపారేయలేం. మరి ఇదే కనుక నిజం అయితే ఈ సినిమాకు మరింత ఆకర్షణ తోడైనట్లే. ఇక జాక్వీలిన్ గత ఏడాది ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహోలో ఓ సాంగ్ లో ప్రభాస్ తో కాలు కదిపింది.

దర్శకుడు క్రిష్ పీరియాడిక్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడు. మొఘలుల కాలం నాటి పీరియడ్ డ్రామాగా తెరక్కెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. మరో వైపు పవన్ శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో చేస్తున్న వకీల్ సాబ్ మే నెలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో పవన్ లాయర్ రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు