జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓట్ చేసిన సినీ ప్రముఖులు వీరే.!

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓట్ చేసిన సినీ ప్రముఖులు వీరే.!

Published on Dec 1, 2020 12:00 PM IST

గత కొన్ని రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాలతో తెలంగాణా రాష్ట్రం హీటెక్కింది. ఇక అన్ని పార్టీల ప్రచారాలు ముగియడంతో నేడు ఆ బిగ్ డే వచ్చింది. దీనితో తెలంగాణా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇక అలాగే వారితో పాటుగా మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే వారెవరో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మరియు ఆయన సతీమణి అమల, అలాగే దర్శకుడు క్రిష్, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అలాగే సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ లు ఇప్పటి వరకు తమ ఓటు హక్కును వారి ప్రాంతాల్లో వినియోగించుకున్నారు. అలాగే మిగతా ప్రముఖ నటుల ఓటింగ్ కూడా ఎప్పుడు చేస్తారా అని వారి అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు