బాక్సాఫీస్ దగ్గర హీరోల సినిమాలు పోటీ పడటం సహజం. కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్లోనూ ఈ పోటీ కొనసాగితే అది కాస్త వెరైటీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెరైటీ ఫీట్ మనకు కనిపించనుంది. తమిళ హీరో విక్రమ్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తమ సినిమాలతో ఓటీటీ ప్లాట్ఫామ్పై పోటీ పడబోతున్నారు.
మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్గా ‘ఎల్2 ఎంపురాన్’ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇక ఈ సినిమా ఇటీవల బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో ఏప్రిల్ 24న స్ట్రీమింగ్కు రానుంది.
అటు చియాన్ విక్రమ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వీర ధీర శూర’ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా కూడా ఏప్రిల్ 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ రెండు సినిమాలో ఓటీటీలో పోటీ పడటం ఖాయమని అభిమానులు అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు ప్రేక్షకులు ఓటేస్తారో చూడాలి.