సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. ఈ చిత్ర టీజర్ ను రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా విడుదల చేశారు. టీజర్ లో ‘శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం చర్చింబోయే అంశం అంటూ ఓ రేడియో వ్యాఖ్యనంతో టీజర్ ఎంతో ఆసక్తికరంగా మొదలైంది. ఆత్రుత, అసహనం, కోపం కలబోసిన భిన్న మనో మనస్తత్వం వున్న కథానాయకుడిగా శ్రీ సింహా ఈ టీజర్లో కనిపిస్తున్నాడు. మొత్తానికి టీజర్ ఇంట్రస్టింగ్ గా ఉంది.
కాగా రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న ప్రేక్షకులముందుకురానుంది. మర్డరీ సస్పెన్స్ మిస్టరీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.