ఎన్టీఆర్ ఛాలెంజ్ ని ఎమోషనల్ గా ముగించిన చిరు… !

ఎన్టీఆర్ ఛాలెంజ్ ని ఎమోషనల్ గా ముగించిన చిరు… !

Published on Apr 23, 2020 10:09 AM IST

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్టార్ట్ చేసిన రియల్ మెన్ ఛాలెంజ్ రాజమౌళితో ప్రాచుర్యం పొంది, టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఆసక్తికరంగా మారుతుంది. ఆడవారికి గౌరవం ఇవ్వడం, వారి శ్రమలో పాలుపంచుకోవడం అనే కాన్సెప్ట్ తో మొదలైన రియల్ మెన్ ఛాలెంజ్ ని అందరూ స్వీకరించడమే కాకుండా పూర్తి చేసి.. తన సన్నిహితులు మరియు ఇష్టమైన వారికి విసురుతున్నారు. రాజమౌళి ఈ ఛాలెంజ్ ఎన్టీఆర్,రామ్ చరణ్ లకు విసిరాడు. ఈ ఛాలెంజ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ సీనియర్ హీరోలైన చిరు, నాగ్, బాలయ్య మరియు వెంకీలను నామినేట్ చేశారు.

ఐతే ఈ ఛాలెంజ్ ని తనదైన స్టైల్ స్వీకరించిన చిరంజీవి నేడు ఆ ఛాలెంజ్ పూర్తి చేసినట్లుగా ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. కొమరం భీమ్ ఛాలెంజ్ కి ఈ వీడియో నా సమాధానం.. ఇది నా రోజూ వారి చర్యనే.. దానికి సాక్ష్యమే ఈ వీడియో అని ట్విట్టర్ లో స్పందించారు. ఐతే ఆ వీడియోలో చిరు తన అమ్మగారైన అంజనా దేవి గారికి స్వయంగా దోసె వేసి వడ్డించడం, ఆమె చిరుకి ప్రేమగా నోట్లో పెట్టడం.. మనసులకు హత్తుకునేలా ఉంది. ఇక చిరు ఈ ఛాలెంజ్ కే టీ ఆర్ గారికి, తన మిత్రుడు రజిని కాంత్ కి విసిరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు