కార్తీ ‘ఖైదీ’ కథ అలా సాగుతుందట…!

కార్తీ ‘ఖైదీ’ కథ అలా సాగుతుందట…!

Published on Oct 19, 2019 10:44 AM IST

హీరో కార్తీ నటించిన తాజా చిత్రం ఖైదీ. ఓ విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా తెలుగు, మరియు తమిళ భాషలలో విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో ఖైదీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ నందు గల దాసపల్లా కన్వెన్షన్ హాల్ నందు సాయంత్ర నాలుగు గంటల నుండి ఈ కార్యక్రమం జరగనుంది. హీరో కార్తీ తో పాటు, దర్శక నిర్మాతలు అలాగే టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని సమాచారం. టాలీవుడ్ నుండి ఓ స్టార్ హీరో అతిధిగా హాజరయ్యే అవకాశం కలదు.

కమర్షియల్ అంశాలకు దూరంగా ప్రయోగాత్మకంగా ఖైదీ చిత్రం తెరకెక్కింది. గతంలో సందీప్ కిషన్ తో నగరం వంటి ప్రయోగాత్మక చిత్రం తీసిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. జీవిత ఖైదు పడిన పరారీ ఖైదీగా కార్తీ నటిస్తున్నారు. ఇక అతని కోసం ఒక రాత్రంతా జరిగే పోలీసుల మరియు రౌడీల వేటే ఖైదీ చిత్రం. ఈ మూవీలో హీరోయిన్ కానీ, పాటలు కానీ ఉండవు. తన పదేళ్ల కూతురుని కలుసుకోవడానికి కార్తీ జైలు నుండి పారిపోతాడట.ఉత్కంఠ రేపే పోరాటాలతో పాటు, కంటతడి పెట్టించే బలమైన ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయట. ఈ మూవీపై తెలుగు, తమిళ భాషలలో మంచి అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు