బాలయ్య, అనీల్ ప్రాజెక్ట్ వారి నిర్మాణం లోనా.?

బాలయ్య, అనీల్ ప్రాజెక్ట్ వారి నిర్మాణం లోనా.?

Published on Jun 13, 2021 9:06 PM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం తన హిట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ చిత్రం “అఖండ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసుకున్న బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా క్లారిటీ ఇచ్చేసారు. దీనితో బాలయ్య అభిమానులు వాటి కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా అఖండ చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా అనీల్ రావిపూడితో ప్రాజెక్ట్ పై అధికారిక క్లారిటీ రాకపోయినా సినిమా ఉందని మాత్రం బాలయ్య చెప్పేసారు. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ చిత్రాన్ని ఎవరు నిర్మాణం వహించనున్నారో తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహించనున్నారట. వారి నిర్మాణంలో ఆల్రెడీ తెరకెక్కిన అవైటెడ్ చిత్రం “టక్ జగదీష్” రిలీజ్ కి కూడా సిద్ధంగా ఉంది. మరి బాలయ్యతో సినిమాపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు