“రాధే శ్యామ్” విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్.!

“రాధే శ్యామ్” విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్.!

Published on Aug 11, 2020 12:21 PM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ తో మరిన్ని అంచనాలను పెంచింది. అలా అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదొక బజ్ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది.

అయితే ఈ సినిమాకు మాత్రం మొదటి నుంచి ఓ విషయంలో అలా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తున్నారు అన్నది ఇంకా తెలియరాలేదు. ఎన్నో అంశాలను వెల్లడించిన ఈ చిత్ర యూనిట్ ఈ ఒక్క అంశాన్ని ఇంకా హోల్డ్ లో ఉంచడం గమనార్హం.

అంటే ఈ సినిమాలో సంగీతం ఎంత ప్రధాన పాత్ర పోషించనుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ పీరియాడిక్ లవర్ స్టోరీలో ఎమోషన్స్ చాలా బాగుంటాయి అని అంటున్నారు. వెండితెరపై వాటిని ఎంతగానో ఎలివేట్ చేసేది సంగీతం తోనే సాధ్యపడుతుంది. అందుకే టీం ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారేమో..మొత్తానికి మాత్రం ఈ ఒక్క అంశం మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు