మహేష్ మళ్ళీ కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారట.

మహేష్ మళ్ళీ కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారట.

Published on Mar 17, 2020 9:35 AM IST

మహేష్ ప్రస్తుతం విరామంలో ఉన్నారు. ఆయన తన తదుపరి చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. గతంలో వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని వారు ధ్రువీకరించడం కూడా జరిగింది. ఐతే కొన్ని కారణాల వలన ఈ చిత్రం హోల్డ్ లో పడింది.

కాగా మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ నుండి కథలు వింటున్నారు. అలాగే మహేష్ ఈసారి కొంచెం వైవిధ్యంగా ట్రై చేద్దాం అని ఆలోచిస్తున్నారట. అందుకే ఇటీవల టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ తెరకెక్కించిన కొత్త దర్శకుల వద్ద నుండి కథలు వింటున్నారని సమాచారం. ఇప్పటికే దర్శకుడు పరుశురాం తో ఆయన కథా చర్చలు జరపడం జరిగింది. అలాగే ఇటీవల భీష్మ మూవీతో మంచి హిట్ అందుకున్న వెంకీ కుడుములకు ఆయన మంచి స్క్రిప్ట్ తో వస్తే మూవీ చేద్దాం అనే ఆఫర్ ఇచ్చారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు