టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “టిల్లు స్క్వేర్”

టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “టిల్లు స్క్వేర్”

Published on Mar 29, 2024 12:00 PM IST

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా, డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ (Tillu square). ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం టెలివిజన్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుంది.

2022 లో రిలీజైన డీజే టిల్లు చిత్రం కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా, నేహ శెట్టి గెస్ట్ రోల్ లో కనిపించగా, ప్రిన్స్, మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి లు ఈ చిత్రానికి సంగీతం అందించగా, భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు