అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ అప్డేట్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ అప్డేట్

Published on Oct 20, 2019 11:52 AM IST

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్న సంగతీ తెలిసిందే. ప్రేక్షకుల్లో ఉన్న ఈ క్రేజ్, అంచనాల్ని అలాగే మెయింటైన్ చేయడానికి టీమ్ అన్ని విధాలా పనిచేస్తోంది. అభిమానుల కోసం నిత్యం ఏదో ఒక అప్డేట్ వదులుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

ఇప్పటికే టీమ్ వదిలిన ‘సామజవరగమన’ సాంగ్ సూపర్ హిట్ కాగా సినిమా పోస్టర్లు, స్టిల్స్ బాగా క్లిక్ అయ్యాయి. అందుకే టీమ్ మరొక కొత్త సప్రైజ్ ప్లాన్ చేసింది. దాన్ని రేపు రిలీజ్ చేయనున్నారు. మరి ఆ సప్రైజ్ అప్డేట్ కొత్త పోస్టరా లేకపోతే ఇంకో పాట విడుదల తేదీనా, టీజర్ అప్డేటా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా టబు, సుశాంత్, జయరామ్, నివేత పేతురాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు