క్రేజీ కాంబినేషన్ లో అల్లు అర్జున్ 20 !

క్రేజీ కాంబినేషన్ లో అల్లు అర్జున్ 20 !

Published on Mar 4, 2019 3:16 PM IST

మహా శివరాత్రి రోజు తన కొత్త చిత్రాన్ని ప్రకటించి ఫ్యాన్స్ ను సప్రైజ్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన తన 19 వచిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయనున్నాడని తెలిసిందే. ఇంకా ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లకముందే తన 20 వచిత్రం గురించి ఈ రోజు ప్రకటించాడు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఈ 20వ చిత్రాన్ని చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇంతకుముందు సుకుమార్, బన్నీ కలయికలో ఆర్య , ఆర్య2 సినిమాలు తెరకెక్కాయి. ఆగస్టు నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక బన్నీ కి త్రివిక్రమ్ తో కూడా ఇది మూడో సారి కావడం విశేషం. ఇంతకుముందు వారిద్దరి కలయికలో జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు తెరకెక్కాయి. మరి మూడో సారి వస్తున్న ఈ కేజ్రీ కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు లు సృష్టిస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు