అక్టోబర్‌లో ‘వాడొస్తాడు’

అక్టోబర్‌లో ‘వాడొస్తాడు’

Published on Sep 28, 2019 7:00 AM IST

ప్రపంచ దేశాలోనే అత్యధికంగా తుపాకులు కలిగివున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా. ఆ దేశంలో జరిగే తుపాకి కాల్పులలో అధికంగా బలైపోతున్నవారు భారతీయులేనని ఇటీవలి గణాంకాల జాబితా చెబుతోంది. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ‘కిక్‌’ శ్యామ్‌ హీరోగా సారథి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘వాడొస్తాడు’. కె.వి.శబరీష్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో హాలీవుడ్‌ స్థాయిలో చిత్రీకరించుకోవడం విశేషం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ దర్శకుడు లింగుస్వామి చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది.అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ…‘‘ఇందులో హీరోగా శ్యామ్‌ ఒక డిఫరెంట్‌ పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్‌గా ఆత్మీయ నటిస్తోంది. మరో హీరోయిన్‌గా శ్రీదేవి కుమార్‌ నటించారు. పలువురు హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు , తమిళ సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో చిత్రీకరించాం. స్టోరి సినిమాకు హైలెట్‌గా నివనుంది. అన్ని కార్యమాలు పూర్తి చేసి అక్టోబర్‌లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:ఎన్‌ఎస్‌ రాజేష్‌కుమార్‌; సంగీతం:ఎమ్‌ఎమ్‌; ఎడిటింగ్‌: ఏకెడి అరుణ్‌ థామస్‌; ఆర్ట్‌: టియన్‌ కపిలన్‌; స్టంట్స్‌: శివ; పాటలు :వనమాలి; సంభాషణలు :కృష్ణతేజ. దర్శకత్వం:సారథి ; నిర్మాత: కె.వి.శబరీష్‌.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు