వైష్ణవ్ తేజ్ తో వెంకీ.. కథ ఫైనల్ అయిందట ?

వైష్ణవ్ తేజ్ తో వెంకీ.. కథ ఫైనల్ అయిందట ?

Published on May 3, 2021 8:00 PM IST

భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న వెంకీ కుడుముల తన తరువాత సినిమా కోసం స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ కి కథ కూడా వినిపించాడు. ప్రస్తుతం వరుణ్ బిజీగా ఉండటం, దానికి తోడు కరోనా సెకెండ్ వేవ్ రావడంతో వెంకీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సి వస్తోంది. అందుకే ఈ లోపు ఒక చిన్న సినిమా చేయాలని వెంకీ ప్లాన్ చేస్తున్నాడట. అయితే, వెంకీ వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట.

ఇప్పటికే వైష్ణవ్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని.. వైష్ణవ్ కి కూడా కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. అన్ని కుదిరితే దసరా లోపు సినిమాని ఫినిష్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట. కాగా భీష్మ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. వెంకీ – వైష్ణవ్ ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉంటాయి. మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. అన్నట్టు వెంకీ ఆ మధ్య మెగాస్టార్ ని కలిసి ఓ కథ వినిపించారని.. వెంకీ చెప్పిన కథ పై చిరు ఇంకా ఏ సమాధానం చెప్పలేదని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు