కొత్త లొకేషన్‌కు చేరుకున్న ‘వాల్మీకి’ టీమ్

కొత్త లొకేషన్‌కు చేరుకున్న ‘వాల్మీకి’ టీమ్

Published on Jul 2, 2019 1:00 AM IST

మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న కొత్త చిత్రం ‘వాల్మీకి’. హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొండుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు ఇది తెలుగు రీమేక్‌ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వరుణ్ తేజ్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన టీమ్ తాజాగా అనంతపూర్ చేరుకుంది.

అక్కడే ఒక పెద్ద ఖాళీ స్థలం చూసుకుని షూటింగ్ ప్లాన్ చేశారు. అక్కడే కొన్ని కీలక సన్నివేశాల చిత్రకరణ జరగనుంది. సెప్టెంబర్ 6వ తేదీన చిత్రం విడుదలకావాల్సి ఉండటంతో మేకింగ్ పనుల్ని వేగవంతం చేశారు టీమ్. ఈ ఆత్రవ మురళి, పూజా హెగ్డేలు కీలక పాత్రలు చేస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు