చరణ్ తో ప్లాన్ చేస్తోన్న మహేష్ డైరెక్టర్ !

చరణ్ తో ప్లాన్ చేస్తోన్న మహేష్ డైరెక్టర్ !

Published on Mar 1, 2020 7:44 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ‘మహర్షి’ ఫేమ్ వంశీ పైడిపల్లితో చేయాలని అనుకున్నారు. కానీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చలేదని, అందుకే ప్రాజెక్ట్ పక్కనపెట్టేశారని అంటున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చెయ్యబోతున్నాడట. త్వరలోనే చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలని వంశీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ తో వంశీ పైడిపల్లి సినిమాని రూపొందించనున్నారట. ఇక వంశీ, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. పైగా వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మరి ఈ సారి వంశీ చేయబోతున్న సినిమా ఏ రేంజ్ హిట్ సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు