ఆ మేధావి కరోనా పై ఎప్పుడో సినిమా తీద్దామనుకున్నాడట

ఆ మేధావి కరోనా పై ఎప్పుడో సినిమా తీద్దామనుకున్నాడట

Published on Apr 3, 2020 6:13 PM IST


రూత్ లెస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏప్రిల్ 1న తనను ఫాలో అయ్యేవారందరినీ ఫూల్స్ చేశారు. కరోనా వైరస్ పై తాను స్వయంగా రాసి, స్వరపరిచి, పాడిన సాంగ్ ప్రోమో విడుదల చేసిన వర్మ.. సాయంత్రం ఫుల్ సాంగ్ విడుదల చేస్తాను అని చెప్పి, ఏప్రిల్ ఫూల్..నో ఫుల్ సాంగ్ అన్నారు. కాగా నేడు ఆయన కరోనా పై మరో ట్వీట్ చేశారు. నిజానికి 2018లో ఇలాంటి వైరస్ పై ఓ మూవీ తీయడానికి ఆయన సిద్దమయ్యారట. తనతో గతంలో సర్కార్, 26/11 అటాక్స్ చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్ పరాగ్ సాంగ్వి ఈ చిత్రాన్నీ ప్రొడ్యూస్ చేయాలనుకున్నారట. దానికి సంబంచిన అనౌన్స్మెంట్ నోట్ లింక్ కూడిన ట్వీట్ ఆయన ట్విట్టర్ లో జతపరిచారు.

ఎబోలా వంటి వైరస్ లు ముంబై లాంటి జనసాంద్రత ఎక్కువగా ఉండే సిటీలో విజృంభిస్తే ఎలా ఉంటుందో చెప్పే విధంగా ఆ సినిమా తీయాలని ఆయన అనుకున్నారట. దీనికి టైటిల్ గా ‘వైరస్’ అని కూడా నిర్ణయించారని ఆ ప్రెస్ నోట్ చదవితే అర్థం అవుతుంది. ఒక వేళ అన్నీ కుదిరి ఆ సినిమా తెరకెక్కి విడుదలైనట్లైతే వర్మ అప్పుడే చెప్పారు అనే వారేమో అందరూ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు