మరో రచయిత దర్శకుడిగా మారబోతున్నాడు. అసాధ్యుడు, మిస్టర్ ఎర్రబాబు వంటి పలు చిత్రాలకు సంభాషణలు అందించిన నంద్యాల రవి దర్శకుడి అవతారం ఎత్తనున్నాడు. కుమార్ బ్రదర్స్ బ్యానర్ పై డి. సురేష్ నిర్మించబోయే ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతుంది.
వరుణ్ సందేశ్ నటించిన రొమాంటిక్ చిత్రం ‘ప్రియుడు’ డిసెంబరు 3న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం వరుణ్ నీలకంఠ దర్శకత్వంలో ‘చమ్మక్ చల్లో’ అనే చిత్రం చేస్తున్నారు.