వరుణ్ తేజ్ ‘స్పేస్ థ్రిల్లర్’ విడుదల తేదీ ఖరారు !

వరుణ్ తేజ్ ‘స్పేస్ థ్రిల్లర్’ విడుదల తేదీ ఖరారు !

Published on Jul 12, 2018 5:17 PM IST

ఘాజీ’ చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి వరుణ్ తేజ్ హీరోగా ఒక స్పేస్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. వరుణ్ తేజ్ వ్యోమగామి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి స్టంట్స్ మరియు విజువల్స్ హైలెట్ గా నిలవనున్నాయి. ఇందు కోసం హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టెక్నిషన్స్ ను ఉపయోగించారు . తెలుగులో మొదటి సారి అంత్యరీక్ష నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు ఉన్నాయి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు